తల్లితండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య

తల్లితండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య

ముద్ర, కోరుట్ల:- కోరుట్ల లోని బిలాల్ పుర కు చెందిన షేక్ హైదర్– సుల్తానా బేగం దంపతుల కూతురు అస్రిన్ బేగం(14) స్థానిక గవర్నమెంట్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతుంది. గత ఐదు రోజులుగా బాలిక స్కూల్ కు వెళ్లడం లేదు. అమ్మాయీ తల్లి సుల్తానా బేగం స్కూల్ కు వెళ్లమని మందలించగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్ రూం లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. మృతురాలి తండ్రి షేక్ హైదర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.