చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి

చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి

గూడూరు మే 15 (ముద్ర): ఇంటర్మీడియట్ లో ఫెయిలయ్యానని ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ  ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం పొనుగోడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మహబూబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన తేజావత్ సింధు, అనే విద్యార్థిని ఇంటర్ లో ఫెయిల్ అయ్యానని నేపంతో మనస్థాపం చెంది ఈనెల 9 తేదీన (రాట్ కిల్) ఎలుకల మందును సేవించింది, సేవించిన మూడు రోజుల తర్వాత తన తల్లిదండ్రులకు ఎలుకల మందు తాగాను అని చెప్పడంతో హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్ కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు మరణించింది. కూతురు మరణాన్ని చూసి తేజావత్ పూలు రోధిస్తున్న తీరును చూసి పలువురు కంటతడి పెట్టారు.