డిఫరెంట్ గిఫ్ట్!

డిఫరెంట్ గిఫ్ట్!

కేసముద్రం, ముద్ర: ఎవరైనా వివాహ వార్షికోత్సవ వేడుకలకు చిన్న చిన్న గిఫ్ట్ లు పంపిణీ చేయడం చూసాం.. అయితే అందుకు భిన్నంగా రెండు నిరుపేద కుటుంబాలకు కూలర్లు గిఫ్ట్ గా అందించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో సోమవారం జరిగింది. కేసముద్రం స్టేషన్ మాజీ సర్పంచ్, ధనసరి సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ అల్లం రమ,  అల్లం నాగేశ్వరరావు దంపతుల 20వ వివాహ వేడుక సందర్భాన్ని పురస్కరించుకొని బ్రహ్మంగారి తండా కి చెందిన ఇద్దరు నిరుపేద గిరిజన కుటుంబాలకు పదివేల రూపాయలు ఖర్చుతో రెండు కూలర్లను అందించారు. పేదలు మండువేసవిలో అల్లాడుతున్న దుస్థితిని చూసి వారికి కూలర్లు అందించాలనే ఆలోచన వచ్చినట్లు వారు తెలిపారు. కూలర్లు అందజేయడంతో పేదలు ఎంతో సంబరపడ్డారు.