నీటి ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన

నీటి ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ముత్యాలమ్మ దేవాలయం వద్ద భక్తులకు నీటి వసతి కోసం ఏర్పాటు చేయనున్న నీటి ట్యాంకు నిర్మాణానికి సర్పంచ్ బట్టు శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. వార్డు సభ్యుడు నర్సింగం వెంకటేశ్వర్లు సోదరి దివంగత రేణుక స్మత్యర్థం 50 వేల రూపాయల ఖర్చుతో నీటి ట్యాంకు నిర్మించనున్నారు. దేవాలయం వద్ద ఉన్న బోరు మోటార్ ద్వారా నీటి ట్యాంకులోకి నీళ్లు ఏర్పాటు చేస్తున్నడంతో భక్తులకు ఇక నీటి ఇబ్బంది తొలగిపోనుంది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముత్యాల నాగమణి శివకుమార్, వార్డు సభ్యులు, బానోత్ పద్మ బాలు నాయక్, తరాల వెంకన్న, బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రేణికుంట్ల సుధాకర్, ముల్క మురళి, పంచాయతీ కార్యదర్శి చుక్కల అశోక్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.