పారిశుద్ధ్య సిబ్బందికి సత్కారం

పారిశుద్ధ్య సిబ్బందికి సత్కారం

కేసముద్రం, ముద్ర: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని గురువారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల్లోని గ్రామాల్లో పల్లె ప్రగతి వేడుకలు నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆయా గ్రామాల సర్పంచులు ఆవిష్కరించి జండా వందనం చేశారు. అనంతరం గ్రామాల్లో ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి ప్రభుత్వం నుంచి జారీ చేసిన ప్రశంసా పత్రాలను అందించి శాలువాతో సత్కరించారు. ప్రభుత్వం పల్లె ప్రగతి కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరించారు.