స్నేహానికి నిర్వచనం వీరే

స్నేహానికి నిర్వచనం వీరే

తండ్రిని కోల్పోయిన బిడ్డకి 60 వేల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అందజేత
కేసముద్రం, ముద్ర: పదో తరగతి వరకు కలిసి చదువుకున్న సహచరుడు అకాల మృత్యువాత పడటంతో అతని కొడుకు భవిష్యత్తు కోసం సహచరులు ఆర్థికంగా అండగా నిలవాలని తలిచారు. ఆ మేరకు స్నేహితులు 60 వేల రూపాయలను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండును గురువారం సహచరుడి భార్య, కొడుక్కి అందజేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన కందుకూరి శంకరాచారి కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మరణించారు.

శంకరాచారికి మూడు సంవత్సరాల వయసు గల నిహాన్ ఆదిత్య, భార్య ఉన్నారు. తండ్రి మరణముతో పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి శంకరాచారి క్లాస్మేట్స్ అలువాల కుమార్, దాసరి కుమార్, కె.కుమార్, సిహెచ్ రఘు, చిలుముల నరేష్, గూబ శ్రీకాంత్, వెంకటేష్, ఆరిఫ్, శంకరాచారి, సుప్రజ, శ్రీనివాసచారి, సునీల్ తదితరులు 60 వేల రూపాయలను సమకూర్చి అందజేసి స్నేహానికి నిర్వచనంగా నిలిచారు. శంకరాచారి కుటుంబానికి సన్నిహితులు ఆర్థికంగా అండగా నిలవడం పట్ల గ్రామస్తులు అభినందించారు.