ఓటర్ల నమోదు కోసం ఇంటింటి సర్వే నిర్వహించాలి

ఓటర్ల నమోదు కోసం ఇంటింటి సర్వే నిర్వహించాలి

కేసముద్రం, ముద్ర: 18 ఏళ్లు పైబడ్డ యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించడానికి బూత్ లెవెల్ ఆఫీసర్లు ఈనెల 25 నుంచి వచ్చే నెల 23 వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలని తహాసిల్దార్ పులి సాంబశివుడు ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల తహాసిల్దార్ కార్యాలయంలో బిఎల్ వో లకు ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ పై అవగాహన కల్పించారు. ఈనెల 25 నుంచి అక్టోబర్ 4 వరకు నిర్వహించాల్సిన విధివిధానాలను వివరించారు. బిఎల్ ఓ లు ఇంటింటి సర్వే నిర్వహించి కొత్తవారికి ఓటు హక్కు కల్పించడంతోపాటు, మరణించిన ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఓట్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల తొలగింపుకు నోటీసుల జారీ, ఓటర్ల జాబితా సవరణ, ముసాయిదా ప్రకటన, తుది జాబితా ప్రకటన తదితర అంశాలపై అవగాహన కల్పించారు.