రోడ్డు ప్రమాదంలో కేసముద్రం మాజీ జడ్పిటిసి వేం పురుషోత్తం రెడ్డి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో కేసముద్రం మాజీ జడ్పిటిసి వేం పురుషోత్తం రెడ్డి దుర్మరణం

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల మాజీ జడ్పిటిసి వేం పురుషోత్తం రెడ్డి వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారిలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తాను ప్రయాణిస్తున్న కారు ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో పురుషోత్తం రెడ్డి కారులోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. 2004లో టిడిపి జెడ్పిటిసి గా కేసముద్రం నుంచి ఎన్నికయ్యారు.