ఓట్ల కోసం వస్తే అడ్డుకుంటాం..?

ఓట్ల కోసం వస్తే అడ్డుకుంటాం..?

•కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలి

రామకృష్ణాపూర్, ముద్ర : రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 22 గెజిట్ చేసి సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచాలని ఎస్.సి.కే.ఎస్ సిఐటియు బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి దూలం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం రామకృష్ణాపూర్ సి.హెచ్.పి లో సిఐటియు అధ్వర్యంలో రైల్వే సైడ్ కాంట్రాక్ట్ కార్మికులతో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచకుండా  ఓట్లు అడిగితే తప్పకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి లచ్చన్న,శ్రీనివాస్,అంజన్న,మల్లేష్,హరీష్ తదితరులు పాల్గొన్నారు.