మార్కెట్లో మహిళా రైతు పైనుంచి వెళ్లిన ట్రాక్టర్ తీవ్ర గాయాలు..

మార్కెట్లో మహిళా రైతు పైనుంచి వెళ్లిన ట్రాక్టర్  తీవ్ర గాయాలు..

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో విక్రయానికి తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల వద్ద నిద్రిస్తున్న మహిళా రైతు పైనుంచి శుక్రవారం తెల్లవారుజామున ట్రాక్టర్ వెళ్లడంతో వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గొట్ల కొండ తండాకు చెందిన లకావత్ శాంతి తీవ్రంగా గాయపడింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహిళ రైతు గురువారం లకావత్ శాంతి మక్కజొన్నలను విక్రయానికి తెచ్చింది. మక్కజొన్నల కుప్ప  వద్ద రాత్రి కాపలాగా పడుకుంది.

శుక్రవారం తెల్లవారుజామున ట్రాక్టర్ లో మరో రైతు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయానికి తెచ్చి మార్కెట్లో పోయడానికి యత్నిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు డాక్టర్ ట్రైలర్ టైరు శాంతి కాలు పైకి ఎక్కింది. దీనితో వెంటనే ఆమె కేకలు వేయడంతో ట్రాక్టర్ డ్రైవర్ ముందుకు తీసుకెళ్లి ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. కాలుకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది రవి, వెంకన్న గాయపడ్డ మహిళా రైతుకు ప్రధమ చికిత్స నిర్వహించి మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.