రైతులకు  పరిహారం ఇచ్చిన మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్​ రెడ్డి 

రైతులకు  పరిహారం ఇచ్చిన మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్​ రెడ్డి 

వరంగల్​ జిల్లాలో మంత్రులు ఎర్రెబెల్లి దయాకర్​ రావు, నిరంజన్​ రెడ్డి పర్యటించారు. రైతులకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇచ్చారు. దుగ్గొండి మండలం  చలపర్తిలో గోదాములు ప్రారంభించారు. రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నిధులతో 10,000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో నిర్మించిన గోదాంను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. గోదాముల ప్రారంభం ద్వారా స్థానిక రైతులు తమ పంటలను నిలువ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, స్థానిక శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.