'పెద్ది' పోరాటంతోనే పాకాల-దేవాదుల లింక్.. 

'పెద్ది' పోరాటంతోనే పాకాల-దేవాదుల లింక్.. 

శాసనసభలో సీఎం కేసీఆర్
ముద్ర ప్రతినిధి, వరంగల్: నర్సంపేట సాగు, తాగునీరుకు ఆయువు పట్టుగా ఉన్న పాకాలను దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ తో లింకు చేసేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారని సీఎం కేసీఆర్ శాసనసభలో వెల్లడించారు. ఆదివారం అసెంబ్లీలో కెసిఆర్ మాట్లాడుతూ.. నాపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి పాకాల ఆయకట్టును సుస్థిరం చేశారన్నారు. పాకలాయకట్టుకు శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించామని తెలిపారు. రైతులు దర్జాగా రెండు పంటలు పండించుకుంటున్నారంటే పెద్ది సుదర్శన్ రెడ్డి చలవతోనే సాధ్యమైందన్నారు. తనతో పోరాటం చేసి రైతుల అభివృద్ధికి కృషి చేసిన పెద్దిని అభినందిస్తున్నట్లు వెల్లడించారు.