వరంగల్ జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం
వరంగల్ జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ భూకబ్జాలపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. అజంజాహి మిల్లు కార్మిక సంఘం కార్యాలయానికి చెందిన 1400 గజాల స్థలాన్ని బినామీలతో ఎమ్మెల్యే కబ్జా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే నరేందర్ భూకబ్జాలపై కార్మికులు పోరాడాలని మావోయిస్టు నేత వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది.