ఉగ్రవాదం, నక్సలిజంను సహించం

ఉగ్రవాదం, నక్సలిజంను సహించం

హైదరాబాద్: ఉగ్రవాదం, నక్సలిజంలలో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా  చెప్పారు. గతంలో అటువైపు వెళ్లినవారిలో అనేక మంది ప్రధాన జీవన స్రవంతిలో చేరుతున్నారన్నారు.  ఉగ్రవాదం , నక్సలిజంలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం 54వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడారు.

సురక్షితమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందదని చెప్పారు. మన దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని, దీనిని సాధించడంలో సీఐఎస్ఎఫ్ పాత్ర చాలా ముఖ్యమైనదని తెలిపారు.