తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది: రేవంత్ రెడ్డి
![తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది: రేవంత్ రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6458ec648b7bc.jpg)
ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు సామాజిక చైతన్యానికి కేంద్రాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సరూర్ నగర్ సభలో ఆయన మాట్లాడుతూ అవి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసిన వేదికలని అన్నారు. మన రాష్ట్రం, మన కొలువులు అనే నినాదంతో విద్యార్థులు పోరాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఐదు శీర్షికల్లో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ఉంటుందన్నారు.