శ్రీరామనవమి ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

శ్రీరామనవమి ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

ముద్రప్రతినిధి, మహబూబాబాద్:మహబూబాబాద్ లో బుదవారం నిర్వహించినున్న  శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లు, పనుల పురోగతిని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ మంగళవారం స్వయంగా పరిశీలించారు. ఈ..కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి ప్రత్యేకసలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో మరింత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పరిశీలన అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ పలుసూచనలు చేసారు.

ఈ పరిశీలనలో జిల్లాకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి, టిపిసిసి అధికారప్రతినిధి చుక్కల ఉదయ్ చందర్,అర్బన్  కాంగ్రెస్ పార్టి, అధ్యక్షలు ఘణపురపు అంజయ్య, ఆలయకమిటి నిర్వాహకులు చౌడవరపు మోహన్ రావు, ఓంనారాయణలోయ,పుప్పల రమేశ్ బాబు,ఎడ్ల రమేష్, నాయకులు నాళ్ళ  నరసింహ రావు,సుదర్శన్ చారి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు నిమ్మల శ్రీను తదతరులు పాల్గొన్నారు