రైతువ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ.. - మహబూబాబాద్ యంపి మాలోత్ కవిత 

రైతువ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ.. - మహబూబాబాద్ యంపి మాలోత్ కవిత 

ముద్రప్రతినిధి, మహబూబాబాద్ : కాంగ్రెస్ పార్టీ రైతువ్యతిరేక పార్టీ అని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, బిఆర్ఎస్ జిల్లాఅద్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. 
కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా భారస కార్యనిర్వాహక అధ్యక్షులు  కేటీఆర్  పిలుపు మేరకు  మహబూబాబాద్ జిల్లాకేంద్రలో ఇల్లందు రోడ్డు 33కేవి విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట గురువారం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు ఉరివేసి రోడ్డు పైన దహనం చేసి నిరసన వ్యక్తం చేసారు.

ఈ..నిరసన కార్యక్రమంలో భారస జిల్లా అధ్యక్షురాలు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత తోపాటు, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ బిందు,  వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులు బాణోత్ రవి కుమార్, భారస నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు మహబూబ్ పాషా, వార్డుకౌన్సిలర్లు ఎడ్ల వేణు మాధవ్ అర్షిక రావిష్, బాణోత్ హరిసింగ్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు నిమ్మల శ్రీనివాస్, బూర్ల ప్రభాకర్, జెర్రిపోతుల వెంకన్న, మంగళం పల్లి కన్నా, మడత వెంకన్న, పంజాల శ్రీనివాస్ మనాది రాజేష్, పొన్నాల యుగేందర్, అసిఫ్ అలీ, బాణోత్ రాము, రమేష్, వెంకన్న, శంకర్, గుర్రాల సురేష్, మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...