శతాబ్దంలో జరగనంత అభివృద్ధి ఈ దశాబ్దంలోనే జరిగింది- సత్యవతి రాథోడ్ 

శతాబ్దంలో జరగనంత అభివృద్ధి ఈ దశాబ్దంలోనే జరిగింది- సత్యవతి రాథోడ్ 

ఏకలవ్య గురుకుల  విద్యాలయాల ప్రవేశ పరీక్ష 2023 -24 ఫలితాలను విడుదలచేసిన  మంత్రి  సత్యవతి రాథోడ్..

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: ఈ శతాబ్దం అంతా చూసిన జరగనంత అభివృద్ధి కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ..దశాబ్దకాలంలోనే జరిగిందని రాష్ట్రగిరిజన,స్త్రీ-శిశుసంక్షేమశాఖలమంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏకలవ్య గురుకుల  విద్యాలయాల ప్రవేశ పరీక్ష 2023 -24 ఫలితాలను   మంత్రి  సత్యవతి రాథోడ్ బుదవారం విడుదలచేసారు.

ఈ..సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ...
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్షకు 8383 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 7252 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారన్నారు. వీరిలో మొదటి విడతలో 1347 మంది విద్యార్థులు  మోటా అడ్మిషన్ గైడ్ లైన్స్ ప్రకారం 23 గురుకులాల్లో సీట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు.

సీట్లు సాధించిన విద్యార్థులకు మంత్రి సత్యవతిరాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల జూన్ 1 నుండి 10వ తారీకు లోపు వారికి కేటాయించిన పాఠశాలలో చేరాలని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్  పాలనలో గురుకులాల సంఖ్య పెరిగిందని, సీఎం కెసిఆర్ పాలనలో 1లక్ష 35 వేల మంది  విద్యార్థులు గురుకుల విద్యను అభ్యసిస్తున్నారన్నారు.

జూన్ 24 నుండి  4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వబోతున్నామని, గతంలో ఎన్నడు లేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో గిరిజనుల అభివృద్ధి జరిగిందని మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. తండాలను గ్రామపంచాయతీలు చేయడం, జీపీ బిల్డింగులు నిర్మించడం, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, 10 శాతం రిజర్వేషన్, బంజారా ఆత్మగౌరవ భవనాలు, గురుకులాలు ఏర్పాటు తో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టి సీఎం కేసీఆర్ గిరిజనులకు స్వర్ణ యుగాన్ని తీసుకొచ్చారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, ఆశ్రమ పాఠశాలలో పనిచేసిన కాంట్రాక్టు రెసిడెన్షియల్ ఉపాధ్యాయులకు 12నెలల వేతనాలు విడుదల చేసిందని తెలిపారు. ఈ ఫలితాల్లో  మహబూబాబాద్ జిల్లాకు చెందిన కిరణ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, పొయ్యారంటే చెందిన హలవత్ ఉమేష్ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. పాఠశాలలో సీబీఎస్ఈ విధానంలోనే

విద్యాబోధన  అందించడం జరుగుతుందన్నారు..
ఆన్లైన్ ద్వారా  9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఐఐటీ కోచింగ్ అందిస్తున్నామని, విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధికారులను ఉపాధ్యాయులను సిబ్బందిని  మంత్రి సత్యవతిరాథోడ్ అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలంటూ వారికి సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏకలవ్య విద్యాలయాల ఓఎస్ డి స్వర్ణలత, డిప్యూటీ సెక్రటరీ చంద్రశేఖర్, ఆర్ సిఓ రాజ్యలక్ష్మి, అకాడమిక్ ఓఎస్డి శ్రీనివాస్,  మహబూబాబాద్ జిల్లా ఏకలవ్య విద్యాలయాల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.