కెసిఆర్ తాత.. మా అమ్మకు ఉద్యోగ భద్రత కల్పించండి..

కెసిఆర్ తాత.. మా అమ్మకు ఉద్యోగ భద్రత కల్పించండి..

చంటి పిల్లలతో జేపీఎస్ వినూత్న నిరసన..!

కేసముద్రం, ముద్ర: సీఎం కేసిఆర్ తాత.. మంత్రి కేటీఆర్ మామా.. మా అమ్మ ఉద్యోగానికి భద్రత కల్పించాలని రాసిన నినాదాలతో ఉన్న పలకలను పట్టుకొని జూనియర్ పంచాయతీ కార్యదర్శి చంటి పిల్లలు వినూత్న తరహా నిరసనకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. తమ సర్వీసులను రెగ్యులర్ చేయాలంటూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నారు.

ఇందులో భాగంగా నారాయణపురం గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శి అనిత తన ఇద్దరు పిల్లలు విహాన్ తేజ్, రిత్విక్ తేజ్ లతో వినూత్న తరహా నిరసన చేపట్టారు. తన ఇద్దరు పిల్లలతో పంచాయతీ కార్యదర్శి నిరసన చేపట్టడం చూసిన ప్రతి ఒక్కరూ దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. పలువురుఈ కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సుమంత్, ప్రవీణ్, శిరీష, మురళి, జాఫర్, మౌనిక, మంజుల, వాణి, అనిల్ పాల్గొన్నారు.