రైలు నుంచి జారిపడి మానుకోట వాసి దుర్మరణం

రైలు నుంచి జారిపడి మానుకోట వాసి దుర్మరణం

కేసముద్రం, ముద్ర: రైలులోంచి ప్రమాదవశాత్తు జారిపడి మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బొల్లం నాగేశ్వరరావు (50) దుర్మరణం పాలైన ఘటన కేసముద్రం రైల్వే స్టేషన్ కు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పక్కన మృతదేహం పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు నాగేశ్వరరావు జేబులో లభించిన మహబూబాబాద్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు తీసుకున్న రైలు టిక్కెట్టు, ఆధార్ కార్డు ఫోటోలు లభించగా వాటి ఆధారంగా మహబూబాబాద్ కు చెందిన సత్కార్ హోటల్ నిర్వాహకుడు నాగేశ్వరరావు గా గుర్తించారు. వెంటనే నాగేశ్వరరావు బంధువులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నాగేశ్వరరావు హైదరాబాదు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వచ్చాడని చార్మినార్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి ఉంటాడని భావిస్తున్నారు.