కనకదుర్గ ఆలయనికి గ్రానైట్ విరాళం

కనకదుర్గ ఆలయనికి గ్రానైట్ విరాళం

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బిచ్య నాయక్ తండాలో నూతనంగా నిర్మించ తలపెట్టిన కనకదుర్గమ్మ ఆలయానికి అవసరమైన గ్రానైట్ ను గోపా డివిజన్ అధ్యక్షుడు, బారాస మండల నాయకుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ విరాళంగా అందజేశారు. ఆలయానికి దాతగా వ్యవహరించాలని  సర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్థులు కలిసి కోరగా స్పందించిన సమ్మయ్య గౌడ్ కనకదుర్గ ఆలయ నిర్మాణానికి, అలంకరణకు కావాల్సిన గ్రానైట్ ను అందించినందుకు బిచ్య నాయక్ తండా గ్రామస్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు మంగమ్మ-రాములు, భారాస గ్రామ పార్టీ అధ్యక్షులు వాంకుడొత్ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.