గ్రంథసేకరణ కార్యక్రమంలో బాగస్వాములుకండి..  మహబూబాబాద్ జిల్లాగ్రంధాలయసంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు..

గ్రంథసేకరణ కార్యక్రమంలో బాగస్వాములుకండి..  మహబూబాబాద్ జిల్లాగ్రంధాలయసంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు..

పిలుపునకు స్పందించి అనేక పుస్తకాలు అందజేసిన మెంటల్ ఎబిలిటర్ బద్రీకుసమ.. 

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యావంతులు, మేధావులు, పుస్తకప్రియులు భవిష్యత్ తరాలకు కానుకగా పుస్తకాలను విరాళంగా అందజేయాలని, గ్రంథసేకరణ కార్యక్రమానికి సహకరించాలని మహబూబాబాద్ జిల్లాగ్రంధాలయసంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు కోరారు. మహబూబాబాద్ జిల్లాగ్రంధాలయసంస్థ ఆద్వర్యంలో చేపట్టిన గ్రంథసేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ప్రారంబించారు.   
జిల్లాగ్రంధాలయసంస్థ ఇచ్చిన పిలుపునకు స్పందించిన ప్రముఖ మెంటల్ ఎబిలిటర్ బద్రికుసుమ పోటీపరీక్షలకు ఉపయోగపడే అనేక రకాల పుస్తకాలను తమ సమీపబందువు శారద ద్వారా పంపించి జిల్లా గ్రంధాలయసంస్థచైర్మన్ నవీన్ రావుకు అందజేశారు. మహబూబాబాద్ జిల్లాగ్రంధాలయసంస్థ వారు మంచి కార్యక్రమం తీసుకున్నారని.., త్వరలోనే తనవంతుగా మరిన్ని పుస్తకాలను అందజేస్తానని బద్రీకుసుమ తెలిపారు. ఈ..కార్యక్రమంలో జిల్లాగ్రంధాలయసంస్థ కార్యదర్శి శ్రీలత, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.