పోలీస్ జాగృతి కళా ప్రదర్శన

పోలీస్ జాగృతి కళా ప్రదర్శన

కేసముద్రం, ముద్ర: చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని, లక్ష్యసాధన తో ముందుకు సాగాలని, వాహనాల డ్రైవింగ్ సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కేసముద్రం ఎస్సై తిరుపతి అన్నారు. మండలంలోని అన్నారం గ్రామంలో సోమవారం రాత్రి పోలీసు జాగృతి బృందం కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నిరక్షరాస్యత, మూఢనమ్మకాలపై అవగాహన, బాల్య వివాహాల వల్ల నష్టం తదితర అంశాలపై ప్రజలకు కళారూపాల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.