అంబులెన్స్ లో ప్రసవం-తల్లి బిడ్డ క్షేమం

అంబులెన్స్ లో ప్రసవం-తల్లి బిడ్డ క్షేమం

కేసముద్రం, ముద్ర: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ మహిళను 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్స్ లో సిబ్బంది సమయస్ఫూర్తితో కాన్పు నిర్వహించారు. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి బిడ్డ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అన్నారంలో గురువారం జరిగింది.

తాళ్లపూస పల్లి గ్రామానికి చెందిన సౌజన్య అనే గర్భిణీకి రావడంతో బంధువులు ఆసుపత్రికి తరలించడానికి 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. గర్భిణీ మహిళను ఆంబులెన్స్ లో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా అన్నారం గ్రామ సమీపంలో నొప్పులు తీవ్రం కావడంతో పరిస్థితి విషమించే అవకాశాలు కనిపించడంతో అంబులెన్స్ సిబ్బంది నరేష్, వెంకన్న సమయస్ఫూర్తితో వ్యవహరించి ఫోన్ ద్వారా పేషెంట్ పరిస్థితిని డాక్టర్లకు వివరిస్తూ వారి సూచన సలహాల మేరకు సాధారణ కాన్పు నిర్వహించారు. తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడిన అంబులెన్స్ సిబ్బందిని సౌజన్య బంధువులు అభినందించారు.