కేటీఆర్ కాస్త అహంకారం తగ్గించుకో..!!

కేటీఆర్ కాస్త అహంకారం తగ్గించుకో..!!
  •  సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే మీ..బతుకేంటో తెలుసుకో..
  • కాంగ్రెస్ ను విమర్శించే అర్హత, స్థాయి నీకు లేదు...
  • మాజీకేంద్రమంత్రి బలరాంనాయక్..

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: మంత్రి కేటీఆర్ తన అహంకారాన్ని కాస్త తగ్గించుకోవాలని మాజీకేంద్రమంత్రి, కాంగ్రెస్ నాయకులు పోరిక బలరాంనాయక్ సూచించారు. మహబూబాబాద్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చేసిన వ్యాఖ్యలను బలరాంనాయక్ తీవ్రంగా తప్పుబట్టారు. సోనియాగాంధీ తెలంగాణరాష్ట్రం ఇవ్వకపోయి ఉంటే.. మీ..కుటుంబం, మీ..బతుకులు ఎలా ఉండేవో ఆలోచించుకోవాలన్నారు.

పోడువ్యవసాయం చేస్తున్న ప్రతిఒక్కరికి పట్టాలు ఇవ్వాలని బలరాం నాయక్ డిమాండ్ చేసారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదనడం కేటీఆర్ అవకాశవాదానికి, అసత్యప్రసంగాలకు అద్దంపడుతుందన్నారు. పోడుభూముల పట్టాలపంపిణీ కార్యక్రమాన్ని పూర్తిగా రాజకీయ కార్యక్రమంగా మార్చారని, కాంగ్రెస్ ను, ఇంకోపార్టీని తిట్టేకార్యక్రమం పెట్టుకున్నారని ఆరోపించారు. మహబూబాబాద్ లో అభివృద్ధి అంతా కాంగ్రెస్ ప్రసాదమేనని తాను కేంద్రమంత్రిగా ఉండగా ఎన్నో అభివృద్ధి పనులు చేసామన్నారు. లంబాడీను ఎస్టీలలో చెర్చిన పార్టీ కాంగ్రెస్ అని.. అందువల్లే సత్యవతిరాథోడ్, కవిత, రెడ్యానాయక్ తదితరులు పదవుల్లో ఉన్నారనే విషయం తెలుసుకోవాలన్నారు. అభివృద్ధి పైన బహిరంగ చర్చకు ఎక్కడైనా సిద్దమన్నారు.

రేపటి ఖమ్మం సభకు బారీగా అడ్డంకులు..

రేపు ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్ జనగర్జనసభకు ప్రభుత్వం, బిఆర్ఎస్ పార్టీ ఏన్నో అవంతరాలు, అడ్డంకులు సృష్టిస్తుందన్నారు. అయినా ప్రతికార్యకర్త, కాంగ్రెస్ అభిమాని కదలి ఖమ్మం రావాలని పిలుపునిచ్చారు. ఈ..విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బెల్లయ్యనాయక్, వెన్నం శ్రీకాంత్ రెడ్డి, ఘనపురపు అంజయ్య, నునావత రాధ తదితరులు పాల్గొన్నారు.