భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

మంత్రి దృష్టికి వెళ్లక ముందే పనులను పూర్తి చేయాలని హితవు 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: పలుచోట్ల చేపట్టిన భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం నాడు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్మాణంలో గల సఖి సెంటర్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, మిట్టపల్లిలో  జిల్లా మహిళా సమైక్య భవనం, వృద్ధాశ్రమం నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక శ్రద్ధతో సిద్దిపేట పట్టణంలో మహిళలు, వర్కింగ్ ఉమెన్స్, మహిళా స్వయం సహాయక సంఘాలు

వృద్ధుల కొరకు సఖి సెంటర్, ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్, జిల్లా మహిళా సమైక్య సంఘ భవనం మరియు వృద్ధాశ్రమంను వారికి అనుకూలమైన,సురక్షితమైన ప్రాంతాలలో నిర్మించేందుకు చర్యలు చేపట్టారని అన్నారు. అనుకున్న రీతిలో నిర్మాణాలు జరుగుతున్నాయని కానీ నిర్మాణ పనులు మరింత త్వరగా పూర్తయ్యేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు అధిక చొరవ చూపాలని అన్నారు. నాణ్యతలో ఎక్కడ కూడా రాజీ పడకుండా భవనాలను నాణ్యమైన మెటీరియల్స్ తో స్ట్రాంగ్ గా నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్ రెడ్డి, డిఆర్డిఓ మోహన్ రెడ్డి, ఆయా నిర్మాణాల ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.