ఖజానా శాఖ  స్ట్రాంగ్ రూమ్  ప్రారంభించిన కలెక్టర్లు

ఖజానా శాఖ  స్ట్రాంగ్ రూమ్  ప్రారంభించిన కలెక్టర్లు

సిద్దిపేట : ముద్ర ప్రతి నిధి :సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా ఖజానా శాఖ స్ట్రాంగ్ రూమ్ ని జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ప్రారంబించారు.ఈ స్ట్రాంగ్ గదిని ఆర్&బి ఇంజనీరింగ్ అధికారులు  అధునాతన పద్దతిలో అత్యంత పకడ్బందీగా   నిర్మించారు. ఖజానా శాఖ విభాగంలో పైల్ లకు మంచి భద్రతతో కూడిన స్ట్రాంగ్ రూమ్ నిర్మించి నందుకు ఇంజనీరింగ్, ఖజానా శాఖ అదికారులను కలెక్టర్ అబినందించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఖజానా శాఖ అధికారి (ఇంచార్జి) జగదీష్ సింగ్,ఆర్&బి ఈఈ  రాము, ఖజానా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.