7వ రోజుకు చేరుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె

7వ రోజుకు చేరుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె

గూడూరు మే 4 (ముద్ర): జూనియర్ పంచాయతీ కార్యదర్శులు న్యాయబద్ధంగా డిమాండ్ చేస్తున్న సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చేస్తున్న సమ్మె గూడూరు మండల కేంద్రంలో ఏడవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మెకు గూడూరు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు గూడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ నునవత్ రమేష్, గూడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఎంపీటీసీ కత్తి స్వామి తమ సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేపీస్ లు న్యాయబద్దంగా గా కోరుతున్న డిమాండ్ పరిష్కరించాలని, తమ పార్టీ తరపున కూడా మాట్లాడతాం అని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం లో గుండెంగ సర్పంచ్ రవిసింగ్ రాథోడ్ బ్రామ్మనపల్లి సర్పంచ్ పునెం యకయ్య గూడూరు జిపి వార్డ్ మెంబర్ యాకయ్య బీసీ సెల్ మండల ప్రెసిడెంట్ ముత్యం రవి గూడూరు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలగందుల శ్రీనివాస్  కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ నాయక్ బాలు నాయక్ రాసమల్ల రాములు తదితరులు గూడూరు మండల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.