కంప్యూటర్ పరిజ్ఞానం పొంది ఉండాలి - పనుల సౌలభ్యం కై లాప్ ట్యాప్ లు
![కంప్యూటర్ పరిజ్ఞానం పొంది ఉండాలి - పనుల సౌలభ్యం కై లాప్ ట్యాప్ లు](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6453a5b3e79af.jpg)
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట : పరిపాలన సౌలభ్యం లో భాగంగా జిల్లాలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కంప్యూటర్ పరిజ్ఞానం పొంది ఉండాలని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టరేట్ లో పనిచేస్తున్న వివిధ విభాగాల పని చేస్తున్న పర్యవేక్షకులకు లాప్ ట్యాప్ లు ఆదనవు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ తో కలసి అందచేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ రాజేంద్ర కుమార్, ఏ.ఓ శ్రీదేవి, సుదర్శన్ రెడ్డి, చంద్ర శేఖర్, పద్మారావు,హేమమాలిని,శంకరయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.