పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో ప్రభుత్వ స్థలంలో పూరి గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం గ్రామపంచాయతీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు గొడిషాల వెంకన్న మాట్లాడుతూ గ్రామంలో నిలువ నీడలేని దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని, అక్కడ నివసించే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, అంతర్గత సిమెంటు రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకురాలు  మండల నాగమ్మ, ఐద్వా నాయకురాలు నాగుల వెంకటమ్మ, బేతమళ్ల నాగమ్మ, మేకల మురళి, తులసి, కవిత, నాగేల్లి పద్మ, నాగుల వెంకటమ్మ, కేతమ్మ తదితరులు పాల్గొన్నారు.