అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దేశంలో ముందంజ రంజాన్ కిట్లు అందించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దేశంలో ముందంజ రంజాన్ కిట్లు అందించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

కేసముద్రం, ముద్ర: అభివృద్ధి సంక్షేమములో దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని, సీఎం కేసీఆర్ దూర దృష్టితో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలతో ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ఇనుగుర్తి మండలాల్లో మంగళవారం నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండగ సామాగ్రి కిట్లను, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ భారత దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో ఒక ప్రయోజనం చేకూర్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ప్రజల కష్ట నష్టాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పరిపాలన సాగిస్తున్న బారాస ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు యోగేశ్వరరావు, మహమ్మద్ దిలావర్ ఆబిద్ అలీ, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, జడ్పీటీసీలు మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, రావుల శ్రీనాథ్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ చైర్మన్ నీలం సుహాసిని, సర్పంచులు యాదగిరి రెడ్డి, రామ్మూర్తి, రైతుబంధు జిల్లా కన్వీనర్ బాలాజీ నాయక్, సొసైటీల చైర్మన్లు లక్ష్మి, దేవేందర్ రావు, వెంకన్న, రైతుబంధు మండల కన్వీనర్ దామర కొండ ప్రవీణ్, వద్దిరాజు కిషన్, బొబ్బిలి మహేందర్ రెడ్డి, బేతమల్ల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.