ఐక్యమత్యానికి నిదర్శనం..! హిందువులకు ముస్లింల చేయూత

ఐక్యమత్యానికి నిదర్శనం..! హిందువులకు ముస్లింల చేయూత

కేసముద్రం, ముద్ర: హిందూ మతానికి చెందిన ఇంటి పెద్దలు అకాల మృత్యువాత పడగా, ముస్లింలు బియ్యం అందజేసి  చేయూతనందించి ఐక్యమత్యానికి నిదర్శనంగా నిలిచిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం కేసముద్రం విలేజ్ లో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన నిరుపేదలు గుండు కోమరమ్మ, సాయిలు  కుటుంబానికి కేసముద్రం విలేజి ముస్లింలు 50 కేజీల చొప్పున బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో రహ్మతీయా మసీదు, దర్గా కమిటీ అధ్యక్షులు షేక్ యాకూబ్ పాషా,  ప్రధాన కార్యదర్శి మహ్మద్ రఫీ, కోశాధికారి షేకు అక్బర్, ఉపాధ్యక్షుడు మహ్మద్ అమీర్, కమిటీ సభ్యులు జావిద్, నాగుల్, తాజ్, జాని, సర్వర్, కరిమ్, యాకూబ్ పాషా, రబ్బానీ, ఉస్సేన్ మియ్య పాల్గొన్నారు.