గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామ పరిధిలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గుడుంబా తయారు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేయగా ఇద్దరు పారిపోయినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గుడుంబా తయారు చేస్తున్న బట్టీలను దోషం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ పోలీసులు మాట్లాడుతూ గుడుంబా తయారుచేసినా, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.