వడదెబ్బతో కూలి మృతి

వడదెబ్బతో కూలి మృతి

కేసముద్రం, ముద్ర: వడదెబ్బకు గురై మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామానికి చెందిన కూలీ బొంపల్లి లక్ష్మి (45) బుధవారం మృతి చెందింది. మృతురాలు కే సముద్రం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ఓ ట్రేడింగ్ కంపెనీలో కూలిగా చాలా ఎళ్లుగా పనిచేస్తోంది. బుధవారం తనకు ఒంట్లో నలతగా ఉందని, మంచంపై ఒరిగిందని, ఈ విషయం గమనించి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆమెకు సపర్యలు చేసి, 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా వారు వచ్చేలోపే మృతి చెందినట్లు లక్ష్మీ కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం వరకు లక్ష్మి కూలి పనికి వెళ్లిందని, మూడు రోజులుగా తీవ్రమైన ఎండల నేపథ్యంలో కూలి పనికి వెళ్లిన లక్ష్మి వడదెబ్బకు గురై మృతి చెందిందని ఇఫ్టు జిల్లా నాయకుడు శివారావు శ్రీధర్ తెలిపారు. లక్ష్మీ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.