కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కురవి ఆలయంలో ప్రత్యేకపూజలు..
- ఘనంగా నిర్వహించిన మంత్రి సత్యవతి రాథోడ్
ముద్రప్రతినిధి, మహబూబాబాద్:బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 47వ పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం రాష్ట్ర గిరిజన,స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. కేటీఆర్, వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద మంత్రి అర్చన, అభిషేకాలు చేసారు. మంత్రి కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
- అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ...
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వారు ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ ప్రతి ఏడాది ఎంతో మందికి చేయూతను అందిస్తున్నారని తెలిపారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని బీఆర్ఎస్ నేతలు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.ఈ ఏడాది గిఫ్ట్ ఏ స్మైల్ భాగంగా స్టేట్ హోంలోని అనాథ పిల్లలకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకుని, 47వ పుట్టిన రోజు సందర్భంగా.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 10, 12వ తరగతుల్లో ప్రతిభావంతులైన 47 మంది పిల్లలకు, ప్రొఫెషనల్ కోర్సుల నుంచి మరో 47 మంది పిల్లలకు వ్యక్తిగతంగా అండగా కేటీఆర్ నిలిచారన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు కొండంత అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్టగొట్టేందుకు చూస్తుందని విమర్శించారు.స్వరాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు, నాణ్యమైన నిరంతర కరెంట్ సరఫరాతో ఆర్థికంగా ఎదుగుతున్న రైతులను మళ్లీ చీకట్లోకి నెట్టేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, కురవి జడ్పిటిసి బండి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కొమ్మి నేని రవీందర్, గుగులోత్ శ్రీరాం నాయక్, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, , కొంపెల్లి శ్రీధర్ రెడ్డి, మన్యుప్యాట్ని, బాదే నాగన్న, నరహరి, గుగులోత్ నెహ్రూ నాయక్, బోడ శ్రీను, కొప్పుల వెంకట్ రెడ్డి,హాచ్య నాయక్, అర్జున్ చౌహాన్, తొట్టి శ్రీను, డాక్టర్ సుందర్ నాయక్, బొమ్మ కంటి వెంకట్, తదితరులు పాల్గొన్నారు.