జాతీయస్థాయిలో కీర్తిబావుట ఎగురవేసిన మహబూబాబాద్ జిల్లావిద్యార్థులు..
![జాతీయస్థాయిలో కీర్తిబావుట ఎగురవేసిన మహబూబాబాద్ జిల్లావిద్యార్థులు..](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_64133abd473e6.jpg)
ముద్రప్రతినిధి,మహబూబాబాద్:
ఇన్ స్పైర్ మనక్ 9 వ జాతీయఅవార్డులలో స్థానం పొందిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు నక్క భవాని,ఎడ్ల నాని లను జిల్లా కలెక్టర్ శశాంక శాలువాతో పుస్తకాలు అందించి గురువారం ఘనంగా సన్మానించారు.
ఏప్రిల్ 10 నుండి 13 వరకు రాష్టపతిభవన్ డిల్లీలో నిర్వహించబడే ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రేన్యూర్షిప్ లో ఈ..ఇద్దరు విద్యార్థులు పాల్గొననున్నారు. జాతీయ స్థాయిలో ఎంపిక చేయబడిన 60 ఎగ్జిబిట్స్ లలో జిల్లా విద్యార్దులు స్థానం సంపాదించడం విశేషం.
తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిక కాబడిన 8 ప్రదర్శనలలో జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్దులు ఎంపిక కాగా ఈ సందర్భంగా విద్యార్దులను, గైడ్ టీచర్లను వారి తల్లిదండ్రులను జిల్లా కలెక్టర్ కె శశాంక ప్రత్యేకంగా వారి చాంబర్లో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా విద్యాశాఖ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ విద్యార్థులకు హామీ ఇచ్చారు జిల్లాకు మంచి పేరు తేవాలని తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రామారావు, జిల్లా సైన్స్ అధికారి జి అప్పారావు పాల్గొనగా వారిని కూడా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు