ఇసుక దొంగలు, పాస్ పోర్ట్ దొంగల్ని తరిమి కొట్టండి

ఇసుక దొంగలు, పాస్ పోర్ట్ దొంగల్ని తరిమి కొట్టండి

కాంగ్రెస్ తెలంగాణా ఇస్తే కెసిఆర్ దోపిడీ చేస్తున్నారు. కేటీఆర్ సన్నాసి వస్తే అభివృద్ధి చూపిస్తాం - బోధన్ పాదయాత్రలో టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డినిజామాబాద్ జిల్లాలో ఇసుక దొంగలు, పాస్ పోర్ట్ దొంగలే రాజ్యమేలుతూ ప్రజల్ని దోచుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వారిని తరిమి కొట్టాలని టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. 


హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో భాగంగా ఆయన గురువారం బోధన్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. లక్షలాది ప్రజల మనోభావాల మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే, కెసిఆర్ ఆ ప్రాంతాన్ని దోచుకునేందుకు ఎగబడ్డారని విమర్శించారు. తెలంగాణ రాకపోయి ఉంటే కెసిఆర్ కుటుంబం రోడ్డున పడేదని ఆయన ఎద్దేవా చేశారు. నిజామాబాద్ ప్రాంతాన్ని జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, షకీల్ వంటి దొంగలు దోచుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి వంటి నేతలు అభివృద్ధి చేస్తే వారిని ఓడించి ఇలాంటి దొంగల చేతికి అప్పగించడం నిజామాబాద్ ప్రజలు చేసుకున్న పాపమని అన్నారు. బిజెపి, భారతీయ రాష్ట్ర సమితి రెండూ కుల రాజకీయాలు చేస్తూ, మతాల పేరిట ప్రజల్ని విడగొడుతున్నాయని ఆరోపించారు. ముస్లింల కొమ్ముకాస్తున్న కెసిఆర్ తొమ్మిదేళ్ల క్రితం ముస్లిం రిజర్వేషన్లు తెస్తానని ఇచ్చిన హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు.


సన్నాసి కేటీఆర్

ఇక కేటీఆర్ లాంటి సన్నాసులు కాంగ్రెస్  చేసిన అభివృద్ధి గురించి ప్రశ్నిస్తున్నారని, నిజామాబాద్ కు వస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. తో పార్టీ అధికారంలోకి వస్తే ఎర్రజొన్న రైతుల సమస్యలు తీర్చడంతో పాటు రూ 5 లక్షల రూపాయలతో ఇళ్ల నిర్మాణం, 2 లక్షల ఉద్యోగాల భర్తీ,రూ. 500 రూపాయలకే సిలిండర్ పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపించే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతు బంధు పథకం కింద ఒక్కో ఎకరానికి 15000 రూపాయలు అందజేస్తామని వివరించారు. ఇప్పటికే కేసీఆర్ హయంలో జరిగే దోపిడీ చాలని, ఈ ప్రభుత్వానికి బై బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.