ఎంపీ బండి సంజయ్ చిత్ర పటానికి పాలాభిషేకం

ఎంపీ బండి సంజయ్ చిత్ర పటానికి పాలాభిషేకం

ముద్ర కోనరావుపేట భారతీయ జనత పార్టీ మండల అధ్యక్షుడు గొట్టే రాంచందర్ అధ్వర్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్బంగా రామచంద్రం మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై  జరుగుతున్నటువంటి అన్యాయాలపై అక్రమాలపై పోరాటం చేస్తున్నా భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి బి ఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం చేయడం సిగ్గు చెటున్నారు.

ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాల పైన  మీరు ఎందుకు స్పందించడం లేదనీ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి మహిళా గవర్నర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు డాక్టర్ ప్రీతి గురించి ఎందుకు మాట్లాడటం లేదు  మహిళా సర్పంచ్ ను వేదిస్తున్న తాటి కొండరాజయ్య గురించి మీరు ఎందుకు స్పందించడం లేదు వీటన్నింటి గురించి అడిగినందుకు దిష్టిబొమ్మలు తగలబేడుతున్నారు  దీనిని మీ విజ్ఞతకే వదిలేస్తాం రానున్న రోజుల్లో మీ పార్టీని బొంద పెట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు కార్యక్రమంలో కొలనూరు ఎంపీటీసీ ఇస్తారీ ప్రవీణ్ కుమార్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మిర్యామ్ కార్ బాలాజీ బీజేవైఎం కార్యదర్శి జితేందర్ పార్టీ కార్యకర్తలు మోత్కు మోహన్ జింక వెంకటి పాత మోహన్ ఆసరి దేవరాజు బోయి నరసయ్య దొర్ల శంకర్ నాగరాజు లక్కం నవీన్ తేజ్ సాగర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.