తారకరత్నకు ఏమైంది?

తారకరత్నకు ఏమైంది?

ఉలిక్కి పడిన ఇండస్ట్రీ
జమున, శ్రీనివాస మూర్తి మరణాలు జీర్ణించుకోవడానికి ముందు మరొక భారీ షాక్‌ తారకరత్న రూపంలో వచ్చింది. ఆయనకు ఏమైందోననే ఆందోళన ఇటు సినిమా, అటు రాజకీయ వర్గాల్లో నెలకొంది.
 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్‌ తలపెట్టిన ‘యువ గళం’ పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్ళిన నందమూరి తారకరత్నకు తీవ్ర గుండెపోటు రావడంతో ఒక్క సారిగా కుప్పకూలిపోయారు.

తొలుత డీహైడ్రేషన్‌ కారణంతో సొమ్మసిల్లి పడినట్టు సమాచారం వచ్చింది. తర్వాత ఆస్పత్రికి తీసుకువెళ్ళగా... పల్స్‌ లేదని, శరీరం రంగు మారిందని వైద్యులు ప్రకటించడంతో నందమూరి, తెలుగు దేశం పార్టీ అభిమానుల్లో ఆందోళన మరింత ఎక్కువ అయ్యింది. కొంత సేపటి తర్వాత ఆయన ప్రాణాపాయం లేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికీ నందమూరి తారక రత్న ఎప్పుడు కోలుకుంటారోనని అందరూ ఓ కంట ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న హెల్త్‌ బులిటెన్స్‌ గమనిస్తున్నారు.