ముత్తారంలో బీఆర్ఎస్ పార్టీ సంబరాలు

ముత్తారంలో బీఆర్ఎస్ పార్టీ సంబరాలు

ముద్ర ముత్తారం: సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో పట్ల ముత్తారం మండల కేంద్రంలోని అడవి శ్రీరాంపూర్ చౌరస్తా లో ఆదివారం సాయంత్రం బీఆర్ఎస్ నాయకులు సంబరాలు  జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ జక్కుల ముత్తయ్య మాట్లాడుతూ కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ను  భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని బీఆర్ఎస్  అన్నారు. మండల కేంద్రములో   బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చెలుకల స్వర్ణలత అశోక్ యాదవ్ మాజీ ఎంపీపీ రైతుబంధు మండల కన్వీనర్ అత్తె చంద్రమౌళి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు నూనె కుమార్, పిఏసీఎస్ చైర్మన్ రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్రావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు కిషన్ రెడ్డి రాగుల సతీష్,  సర్పంచ్ లు సతీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పప్పు చంద్రమౌళి బీద సంపత్, మద్దెల దివాకర్, భూపెల్లి మొగిలి, దుబాసి శ్రీనివాస్, గట్టు రమేష్, ఓడ్నాల రాజు, పూదరి మహేందర్,  కలవేన బాలమల్లు,  ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.