నెలల వ్యవధిలోనే గుండెపోటుతో భార్యాభర్తల మృతి

నెలల వ్యవధిలోనే గుండెపోటుతో భార్యాభర్తల మృతి

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన గంజి నరసింహారెడ్డి, గంజి అహల్య నెలల వ్యవధిలోనే గుండెపోటుతో మృతి చెందారు. నరసింహారెడ్డి డిసెంబర్ 26న గుండెపోటుతో మృతిచెందగా, ఆయన భార్య అహల్య (65) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో వారి కుమారులు వెంకట్రెడ్డి చందర్ రెడ్డి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.