కేసముద్రం మార్కెట్ గ్రేడ్-3 కార్యదర్శిగా రాజేంద్రప్రసాద్

కేసముద్రం మార్కెట్ గ్రేడ్-3 కార్యదర్శిగా రాజేంద్రప్రసాద్

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ గ్రేడ్-3 కార్యదర్శిగా రాజేంద్రప్రసాద్ నియమిస్తూ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం మార్కెట్ సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న రాజేంద్రప్రసాద్ కు గ్రేడ్-3 కార్యదర్శిగా పదోన్నతి కల్పించి కేసముద్రం మార్కెట్ కు బదిలీ చేశారు. ఈ మేరకు రాజేంద్రప్రసాద్ కేసముద్రం మార్కెట్లో గ్రేడ్ -3 కార్యదర్శిగా విధుల్లో చేరారు. కాగా ఇక్కడ గ్రేడ్-3 కార్యదర్శిగా పనిచేసిన రాజాకు గ్రేడ్-2 కార్యదర్శిగా పదోన్నతి కల్పించి జమ్మికుంటకు బదిలీ చేశారు.