సబ్ స్టేషన్ ను వెంటనే ప్రారంభించాలని సిపిఎం ధర్నా

సబ్ స్టేషన్ ను వెంటనే ప్రారంభించాలని సిపిఎం ధర్నా

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సత్యనారాయణపురం లో నిర్మాణం చేసినటువంటి సబ్ స్టేషన్ ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సబ్ స్టేషన్ ఎదుట సిపిఎం ఆద్వర్యంలో దర్నా నిర్వహించారు. సబ్ స్టేషన్ ప్రారంబించినట్లయితే సత్యనారాయణపురం, ముల్కనూర్ చుట్టుపక్క గ్రామాల ప్రజలకు లోవోల్టేజ్ సమస్య తీరుతుందని, నాణ్యమైన విద్యుత్ సౌకర్యవవంతంగా అందుతుందని సిపిఎం నాయకులు డిమాండ్ చేసారు. ఈ దర్నా కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా హరినాయక్, పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎం గిరిప్రసాద్, సత్యనారాయణపురం ఉప సర్పంచ్ శ్రీలత గ్రామస్తులు సరిత, రాధా, శారద తదితరులు పాల్గొన్నారు.