పీపుల్స్ మార్చి పాదయాత్రలో ప్రజల నుంచి బట్టి విక్రమార్కకు వినతుల వెల్లువ

పీపుల్స్ మార్చి పాదయాత్రలో ప్రజల నుంచి బట్టి విక్రమార్కకు వినతుల వెల్లువ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌లో సీఎల్పీ నేత  భ‌ట్టి విక్ర‌మార్క వ‌ద్ద‌కు విన‌తులు ఇసున్న  ప్ర‌జ‌ లు క‌ష్టాలు తీర్చాలంటూ.. భ‌ట్టికి విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పిస్తున్న ప్ర‌జ‌లు తాడూర్ గ్రామం నుంచి పాద‌యాత్ర‌గా వెళుతున్న భ‌ట్టి విక్ర‌మార్క వ‌ద్ద‌కు వ‌స్ప‌రి ఎల్ల‌మ్మ‌, ఆమె భ‌ర్త వ‌స్ప‌రి ప‌ర్వ‌తాలు వ‌చ్చి.. నా బిడ్డ‌ను చంపేశారు.. ఇచ్చిన భూమిలోకి మ‌మ్మ‌ల్ని రానివ్వ‌డం లేదు.. తాహ‌శీల్దార్ మాకు కొత్త పాస్ బుక్కులు ఇవ్వ‌డం లేదు.. స్థానిక ఎమ్మెల్యే వాళ్ల కి అండగా ఉన్నాడు.. మీరే మ‌మ్మ‌ల్ని కాపాడాలంటూ.. విన‌తిప‌త్రం ఇచ్చారు అంతా విన్న సీఎల్పీ నేత‌ భ‌ట్టి విక్ర‌మార్క రాబోయో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో అంద‌రికీ మేలు జ‌రుగుతుంద‌ని హామీ ఇచ్చారు..మేము ఉపాధి కూలీలం.. మాకు మూడు నెల‌ల‌కోసారి డ‌బ్బులు ఇస్తున్నారు ప‌ని చేసే స‌మ‌యంలో క‌నీసం సౌక‌ర్యాలు కూడా ఉండ‌డం లేదు మీరే చూడండి ఇక్క‌డ ఎలా ప‌నిచేస్తున్నామో అని తాడూర్ గ్రామానికి చెందిన ఎం.డీ.  పాషా, నూర్ బీ, త‌స్లీమా, శ్రీల‌త‌, మైమూదాలు భ‌ట్టి విక్ర‌మార్క‌కు చెప్పారు. అంతేకాక ఇండ్లు లేవు.. మేము నిరుపేద‌లం.. రేష‌న్ షాపులో ఇచ్చే బియ్యం కూడా బాగుండ‌డం లేదని వారు భ‌ట్టి విక్ర‌మార్క‌కు చెప్పారు.