మర్రి జనార్ధన్ రెడ్డి పై కేసు నమోదు చేసిన పోలీసులు...!

మర్రి జనార్ధన్ రెడ్డి పై కేసు నమోదు చేసిన పోలీసులు...!

ముద్ర,నాగర్ కర్నూల్:- నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు.రూ. 2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని సిర్శావాడ గ్రామంలో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని రూ. 2 కోట్ల 50 లక్షలతో నిర్మించారు. ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు.



ఇప్పుడు ఇదే వివాదంగా మారింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు పోలీసులు. నాగర్ కర్నూల్ పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. ఎమ్మెల్యే కాకుండా మాజీ ఎమ్మెల్యేను ఎలా ప్రారంభించడానికి అనుమతిస్తారు అంటూ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ అధికారి డీఈఓ మీద దాడికి యత్నించారు కాంగ్రెస్ నాయకులు. నా తప్పేం లేదు అంటూ దండం పెట్టి బతిమాలుకున్న డీఈఓకు ప్రొటెక్షన్ ఇచ్చి పంపించారు పోలీసులు. పాఠశాల ప్రారంభోత్సవం కోసం ఎమ్మెల్యే పేరుతో ఒకటి, మర్రి జనార్ధన్ రెడ్డి పేరుతో రెండు శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. అయితే.. ఇందులో ఎమ్మెల్యే కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం విరగ్గొట్టారు ఎమ్మెల్యే అనుచరులు. ఈ తరుణంలోనే...మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు పోలీసులు.