గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలని ఎవ్వరూ నమ్మొద్దు..

గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలని ఎవ్వరూ నమ్మొద్దు..
  • మనల్ని అరిగోసలు పెట్టిన కాంగ్రెస్ పార్టీని బొంద పెడుదాం..
  • కారు గుర్తుకు ఓటు వెయ్యండి..
  • అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించండి...

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: పుల్జాల,మల్కాపూర్ గ్రామాల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గ్రామంలో ప్రజలని కలిసి గత రెండుసార్లుగా భారీ మెజారిటీతో గెలిపించారు  మళ్లీ మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలను పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు,అనంతరం మల్కాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు గత 10 ఏళ్లుగా అందించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మళ్ళీ అధికారంలోకి వచ్చాక చేపట్టే కార్యక్రమాలను వివరించి కారు గుర్తుకు ఓటు వేసి మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని అని కోరారు..రైతులకు, రైతు బంధు, రుణ మాఫీ,24గంటల కరెంట్, రైతు భీమ,సరైన సమయంలో ఎరువులు, సాగు నీళ్ళు అందజేస్తున్న సీఎం కెసీఆర్ కి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు అందరూ అండగా వుండాలి..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారినవి, ఒకప్పుడు గ్రామాల్లో కరెంట్ వుండేది కాదు, తగాడానికే నీళ్ళు వుండేవి కాదు, పశువులకు గడ్డి కూడా దొరకపోయేది,కానీ ఎప్పుడూ ఎక్కడా ఏ గ్రామంలో చూసిన పచ్చని పంట పొలాలతో, నిండుగా ఉన్న చెరువులలో కళకళలాడుతున్నాయి నేను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత గ్రామాల్లో పెద్దఎత్తున సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం జరిగింది కాంగ్రెస్ పాలనలో రోడ్లు లేక బజార్లలో వరి నాట్లు వేసి నిరసన తెలిపే వారు,కానీ ఈరోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు వెయ్యడం జరిగింది అన్నారు.

కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మళ్ళీ మనకు కష్టాలు వస్తాయి ,కాంగ్రెస్ పార్టీలో 30 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు వున్నారు,అదే BRS పార్టీలో అయితే ఒకే ఒక్కడు సీఎం కెసీఆర్ మూడు గంటల కరెంట్ ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు లేక 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న BRS పార్టీ కి ఓటు వేస్తారా నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంటే 200 పించాన్ ఇచ్చే వాళ్ళు రేపు 4000 వెలు ఇస్తారట,ముందు వారు ఇప్పుడు అధికారంలో వున్న రాష్ట్రాల్లో 4000 వెలు పింఛన్ అమలు చేసి తెలంగాణ ప్రజలకు చుపియలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్టే కారు చీకట్లు కమ్ముకుంటాయి, ఇప్పుడెప్పుడే వెలుగులు వచ్చిన మన జీవితాల్లో మళ్ళీ చీకట్లు వస్తాయి ఒక ఆడబిడ్డ పుడితే కెసీఆర్ కిట్టు అందజేసి 13 వెలు,ఒక ఆడబిడ్డ పెళ్లి చేస్తే 1 లక్ష రూపాయలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం,ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు MJR ట్రస్ట్ అధ్వర్యంలో ఎన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటివరకు 15 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అన్ని మౌలిక సదుపాయాలతో కొత్త భావనలు నిర్మించాం ట్రస్ట్ అధ్వర్యంలో సామూహిక వివాహాలు,ఉచిత డ్రైవింగ్ లైసెన్స్,మర్రన్న క్యాంటీన్ వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నము అని తెలిపారు..