శ్రీశైలం రిజర్వు ఫారెస్టులో పులుల జాడలు

శ్రీశైలం రిజర్వు ఫారెస్టులో పులుల జాడలు ఉన్నాయి. రెండు ఆడ పులి పిల్లలు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెల్దుర్తి మండలం లోయపల్లిలో అడుగు జాడలు గుర్తించారు. పల్నాడు– శ్రీశైలం రిజర్వు ఫారెస్టుల మధ్య పులులు తిరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. జనావాసాలకు దూరంగా పులులు సంచరిస్తున్నట్లు డీఎఫ్​ఓ చెప్పారు.