రేవంత్​ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు: తలసాని 

రేవంత్​ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొత్త బిచ్చగాళ్ళు వస్తున్నారని అన్నారు.