రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ దాడులు
![రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ దాడులు](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63fdaf8f4f9b5.jpg)
హైదరాబాద్: నగరంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. వండర్ సిటీ, రాయల్ సిటీ సహా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై దాడులు కొనసాగుతున్నాయి. ఆయా కార్యాలయాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు. దిల్సుఖ్నగర్లోని గూగి రియల్ ఎస్టేట్ సంస్థ ప్రధాన కార్యాలయంపై దాడులు చేసి వివిధ పత్రాలను పరిశీలిస్తున్నారు. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసం ఉండటంతో ఐటీ అధికారులు కేసు నమోదు చేసి సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు 20 ఐటీ బృందాలు పాల్గొన్నాయి.