సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి

సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి

ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో తన అరెస్టును, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ తీరును సవాలు చేస్తూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా  మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆదివారం సీబీఐ ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ  కోర్టు నిన్న ఉత్తర్వులిచ్చింది. ఈ పరిమాణాల నేపథ్యంలో ఆయన సుప్రీం మెట్లెక్కారు. సిసోదియా అభ్యర్థనను అత్యవసర విచారణ నిమిత్తం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందు ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.